News December 30, 2024

శ్రీ సత్యసాయి జిల్లా నేర గణాంకాల వార్షిక నివేదిక విడుదల

image

శ్రీ సత్య సాయి జిల్లా నేర గణాంకాల వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ రత్న విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులతో కలిసి వార్షిక నివేదికను విడుదల చేశారు. ఏడాది కాలంలో జిల్లాలో నమోదైన వివిధ కేసుల గణాంకాలు, బాధితులకు చేసిన సత్వర పరిష్కారం, పోలీస్ శాఖ పనితీరుపై వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.

Similar News

News October 19, 2025

‘రబీలో 1,07,503 హెక్టార్లు సాగులోకి రావొచ్చు’

image

రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పప్పుశనగ 65,017 హెక్టార్లు, నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7888 హెక్టార్లు, వరి 6069, జొన్న 4919, ఉలవ 1377, పొద్దుతిరుగుడు 1230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చన్నారు. గతేడాది రబీలో సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 హెక్టార్లు తగ్గవచ్చన్నారు.

News October 19, 2025

గుంతకల్లు: రైళ్లకు అదనపు బోగీలు జోడింపు

image

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణాల రద్దీ దృష్ట్యా అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా పలు రైళ్లకు అదనపు బోగీలు జోడిస్తున్నట్లు గుంతకల్లు డివిజన్ అధికారులు తెలిపారు. కలబుర్గి – బెంగళూరు రైలు 06208 అక్టోబర్ 21న, ఫర్నగర్బెం – గలూరు రైలు 06262 అక్టోబర్ 24న గుంతకల్లు మీదుగా అదనపు బోగీలతో నడుస్తుందని వివరించారు.

News October 19, 2025

యాడికి: మహిళపై అత్యాచార యత్నం.. 11 మందిపై కేసు

image

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ ఆత్యాచార యత్నం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించారు. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.