News January 29, 2025
శ్రీ సత్యసాయి: ‘నా కోరిక తీర్చు.. లేదంటే చస్తా’

కదిరి పట్టణం అమీన్ నగర్లో ఓ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. ‘టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను కొంతకాలంగా మాబు అనే వ్యక్తి తన కోరిక తీర్చాలంటూ వెంట పడి వేధించేవాడు. కోరిక తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించేవాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు’ అని పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 16, 2025
రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు IAS ఆఫీసర్ వోరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఈయనను RJ ప్రభుత్వం డిప్యుటేషన్పై రప్పించి సీఎస్ బాధ్యతలు అప్పగించింది. ఈయన 1966లో అరకు లోయలో జన్మించారు. భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ పూర్తయ్యాక IASకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.
News November 16, 2025
SKLM: బంగారమంటూ పిలిచి.. బురిడీ కొట్టించాడు

ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుందామని ఆ యువతిని కుర్రాడు నమ్మించాడు. బంగారమంటూ పిలిస్తే..మురిసిపోయిందేమో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. శ్రీకాకుళానికి చెందిన వీరిద్దరూ HYDకు ఈనెల14న బయలుదేరారు. VJAలో బస్సు మారే క్రమంలో నగల బ్యాగ్, ఫోన్తో పారిపోయాడు. చావే దిక్కని ఏడుస్తున్న ఆమెను కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తే విషయం తెలిసింది. దర్యాప్తు చేసి నగలతోపాటు యువతిని పేరెంట్స్కు నిన్న అప్పగించారు.
News November 16, 2025
వేరుశనగ పంట కోత.. ఇలా చేస్తే మేలు

వేరుశనగ పంటలో 75 నుంచి 80 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. పంటకోత కొరకు డిగ్గర్ యంత్రాన్ని, మొక్క నుంచి కాయలను వేరుచేయటానికి త్రైషర్ యంత్రాన్ని ఉపయోగిస్తే మంచిది. త్రైషర్ ద్వారా ఒక గంటకు 2 నుంచి 2 1/2 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. ఇలా కూలీల కొరతను అధిగమించవచ్చు. కోత తర్వాత కాయలను బాగా ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువ లేకుండా చూసుకోవాలి.


