News August 27, 2025
శ్రీ సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కడప జిల్లా కొండాపురం(M) లావనూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా వాసులు ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యల్లనూరు మండలం దుగ్గుపల్లె వద్ద పంప్ హౌస్లో పనిచేసి తిరిగి బైక్పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. కిందపడిపోగా ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టడంతో శివకుమార్(29), అంజనేయులు(27) మృతిచెందారు.
Similar News
News August 27, 2025
భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

భద్రాచలంసీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం నిత్యకళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల మధ్య అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
News August 27, 2025
నిడిగొండలో చారిత్రక కాంతులు..!

జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండ చారిత్రక, ఆధ్యాత్మిక చిహ్నాల సంపన్న గ్రామం. అనేక శిల్పాలు, శాసనాలు ఘనమైన వారసత్వ సంపద కలిగిన గ్రామం. ఈ గ్రామంలో నేటి వరకు 10 గణపతి మూర్తులను మనం దర్శించవచ్చు. మరికొన్ని దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ శిల్పాలు చక్కని రూప లావణ్యంతో, శిల్ప కళా విశేషాలతో కూడియున్నవి. ఇందులో రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, కాకతీయ అనంతర కాలంలోనివి. మన వారసత్వానికి ప్రతీకలు.
News August 27, 2025
JGTL: కరాటే పోటీల్లో మైనారిటీ కళాశాల విద్యార్థికి ‘GOLD’

జగిత్యాలలోని తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల(టీజీఎంఆర్జేసీ) విద్యార్థి ఎం.డీ.అయానుద్దిన్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్- 2025లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ పోటీల్లో ఫైనల్స్లో ఆయన ఇరాక్ ఆటగాడిని ఓడించి అంతర్జాతీయ వేదికపై మన దేశఖ్యాతిని చాటాడు. స్వదేశానికి పేరుప్రఖ్యాతులు తెచ్చిన అయానుద్దిన్ను కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.