News May 28, 2024
శ్రీ సత్యసాయి: SBI ఉద్యోగి అరెస్ట్

SBI కదిరి వ్యవసాయ శాఖ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వెంకట నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రూ.1.50 కోట్లకు పైగా నగదును ఇతర ఖాతాలకు మళ్లించి తాను వాడుకున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో SBI రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చిలో ఆయనపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు.
Similar News
News September 13, 2025
అనంతపురం జిల్లా కలెక్టర్గా ఆనంద్ బాధ్యతలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.
News September 13, 2025
‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.
News September 13, 2025
ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.