News March 16, 2025
శ్రీ సత్య సాయి జిల్లా: పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలలో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్నం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు.
Similar News
News March 17, 2025
విషాదం: అమెరికాలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6), ప్రగతి రెడ్డి అత్త సునీత(56)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూయడం టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.
News March 17, 2025
మాకవరపాలెం: బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

మాకవరపాలెం మండలం చామంతిపురంలో ఒక యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్(17) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు.
News March 17, 2025
కామారెడ్డి: భార్యని చంపిన భర్త

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్పేట్లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్పేటకు చెందిన నవీన్కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్పేట్లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.