News September 22, 2024

షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను డీఎస్పీగా నియమించడం పట్లం హర్షం వ్యక్తం చేస్తూ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 22, 2024

పిట్లం: నీటి కుంటలో పడి రైతు మృతి

image

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన ఘటన పిట్లం మండలం కారేగాంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కారేగాం గ్రామానికి చెందిన బేగరి దశరథం (55) తన పంట పొలానికి నీటిని తోడేందుకు మోటారును పెద్ద చెరువు కుంటలో వేశాడు. మోటారు మోరాయించడంతో దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 22, 2024

నస్రుల్లాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. అంకోల్ గ్రామానికి చెందిన కుర్మరామ్‌గోండ(40) శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

News September 22, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు

image

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మార్కెట్ కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ మార్కెట్ కమిటీకి ముప్పిడి గంగారెడ్డి, కమ్మర్‌పల్లికి పాలేపునర్సయ్య, వేల్పూర్‌కు కోతినేటి ముత్యం రెడ్డి, బిక్కనూర్‌కు పాత రాజును ఛైర్మన్‌లుగా నియమించారు.