News June 21, 2024
షర్మిలను కలిసిన కాంగ్రెస్ కర్నూలు జిల్లా నాయకులు
విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళావెంకట్రావు భవన్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గురువారం జిల్లా అభ్యర్థుల సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి షర్మిల వివరించారని ఆ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ రమేశ్ యాదవ్ తెలిపారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ ఉన్నారు.
Similar News
News October 4, 2024
పెన్షన్ పంపిణీలో జిల్లా అగ్రస్థానం: కలెక్టర్
కర్నూలు జిల్లా పెన్షన్ పంపిణీలో 3 నెలలు వరుసగా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు పెన్షన్ పంపిణీ అధికారులకు అభినందనలు తెలిపారు. శుక్రవారం 15 మంది అధికారులను ఆయన ఘనంగా సన్మానించారు. పెన్షన్ పంపిణీలో జిల్లా ప్రథమ స్థానంలో చేరేలా కృషిచేసిన డీఆర్డీఏ పీడీ సలీం బాషాను సత్కరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News October 4, 2024
బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్
దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం బన్నీ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.
News October 4, 2024
Way2News వార్తకు స్పందించిన పోలీసులు.. బాలుడు లభ్యం
గోనెగండ్ల పరిధిలోని చిన్నమరివీడుకు చెందిన వర్ధన్ నాయుడు భారతీ దంపతుల కుమారుడు సూర్యతేజ(14) నిన్నటి రోజు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని తల్లి భారతి రోధించిన తీరును Way2News ప్రచురించింది. సీఐ గంగాధర్ స్పందించి ఏఎస్ఐ తిమ్మారెడ్డిని ఆదేశించడంతో.. బాలుని ఆచూకీ కోసం కర్నూలులో గాలించారు. పాత బస్టాండ్లో ఆచూకీ లభించింది. దీంతో Way2Newsకు, పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.