News March 3, 2025

షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News November 9, 2025

ఈనెల 11న ములుగులో ‘ఐక్యత పాదయాత్ర’

image

‘ఏక్ భారత్ – ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో ఈ నెల 11న ఉదయం ములుగులో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో సమైక్యతను పెంచేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ వరకు జరిగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News November 9, 2025

వేములపల్లిలో ఉరేసుకుని వివాహిత మృతి

image

ఉరివేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం ద్వారపూడి శివారు వేములపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. ముమ్మిడివరం (m) సోమదేవరపాలెంకు చెందిన మట్టా రేఖ (24) వేములపల్లిలో పాకలో ఉరివేసుకుని మృతి చెందింది. వేములపల్లిలో తండ్రి ఇంటికి 4నెలల క్రితం కాన్పుకోసం వచ్చింది. ఫోన్లో ఆమె భర్త వేణుతో గొడవ పడినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

News November 9, 2025

పేకాట శిబిరంపై దాడి.. రూ.68,920 సీజ్‌: సీఐ

image

కురుపాం మండలం సింగుపురం సమీపంలో పేకాట శిబిరంపై సీఐ బి.హరి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకొని వారి వద్ద ఉన్న రూ.68,920 సీజ్‌ చేశామని సీఐ తెలిపారు. పట్టుబడినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఎస్సైలు నారాయణరావు, శివప్రసాద్, పోలీస్ సిబ్బంది