News June 29, 2024
షాద్నగర్ ఘటనలో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719589834101-normal-WIFI.webp)
షాద్నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విచారణ వ్యక్తం చేశారు. పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఘటలో మృతిచెందిన, గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Similar News
News July 1, 2024
NGKL: ఆస్పత్రి నుంచి ఈశ్వరమ్మ డిశ్ఛార్జి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719810869259-normal-WIFI.webp)
నాగర్కర్నూల్ జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ పూర్తిగా కోలుకోవడంతో నిమ్స్ నుంచి డిశ్ఛార్జి చేశారు. కొందరి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గత నెల 23న నిమ్స్లో చేర్చారు. 8 రోజులు చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఆమె వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి జూపల్లి రూ. లక్ష చెక్కును ఆమెకు అందజేశారు.
News July 1, 2024
NGKL: నేటి నుంచి అభయారణ్యంలో ప్లాస్టిక్ నిషేధం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719788988379-normal-WIFI.webp)
అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్ అభయారణ్యంలో జూలై 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మన్ననూర్ ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ తెలిపారు. పర్యావరణం పరిరక్షణ, వన్య ప్రాణుల వనగడను దృష్టిలో ఉంచుకొని అభయారణ్యంగా గుర్తించి ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడరాదన్నారు. వాటర్ బాటిళ్లు, బిస్కెట్ కవర్లు, పాలిథిన్ కవర్లు పడేయవద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.
News July 1, 2024
MBNR: ఆరు తడి పంటలకు ప్రాణం !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719807020919-normal-WIFI.webp)
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆరుతడి పంటలైన పత్తి, జొన్న, మొక్క జొన్న, కంది పంటలకు ఊరట లభించింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల నుంచి వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వర్షం పడకపోతే మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉండగా.. ఈ వాన ఊపిరి పోసింది. ఈ వర్షంతో 15 రోజుల వరకు పంటలకు భరోసా దక్కినట్లేనని రైతులు అంటున్నారు.