News June 28, 2024
షాద్నగర్ పేలుడు.. మృతులు వీరే
షాద్నగర్ పరిధిలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన నితీష్ కుమార్(22), రామ్ సెత్(24), బీహార్కు చెందిన రాంప్రకాష్(31), చిత్తరంజన్(31), ఒడిషాకు చెందిన రతికాంత్ అనే కార్మికులు మృతి చెందినట్లు ఆర్డీవో మాధవరావు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News September 21, 2024
తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర ఎనలేనిది: మాజీ మంత్రి
తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎనలేనిదని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన ఉపన్యాసాల పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని వెల్లడించారు.
News September 21, 2024
NGKL: దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్కు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కుచుకూళ్లను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప స్థానంలో ఉంచినందుకు నాగర్ కర్నూల్ ప్రజలకు, తనను గుర్తించి గౌరవ సత్కారం చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 21, 2024
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో నూతన పోలీస్ స్టేషన్లకు కసరత్తులు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జనాభా, పరిపాలన సులభతరం కావడానికి గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. గండీడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన జిల్లా ఎస్పీ జానకి ప్రభుత్వానికి పంపించామని శుక్రవారం తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో 3వ టౌన్, జడ్చర్లలో సబ్ డివిజన్ కార్యాలయం, ట్రాఫిక్ రూరల్ పోలీస్ స్టేషన్, కౌకుంట్లలో నూతన భవనాలకు నివేదికను ఇచ్చామన్నారు.