News March 3, 2025
షాబాద్: రెండు బైక్లు ఢీకొని యువకుడి మృతి

రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతి చెందారు. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాలు.. కొత్తూరు మండలం మల్లాపూర్ తండాకు చెందిన మెగావత్ నైందు(27), షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన కావలి రంజిత్ కుమార్ బైక్లు మద్దూరు సమీపంలో ఢీకొన్నాయి. దీంతో నైందు మృతిచెందగా.. రంజిత్, ఆయన మూడేళ్ల కొడుకు తీవ్రంగా గాయపడగా రంజిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి భార్య రాధిక ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 3, 2025
వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు: విశాఖ డీఈవో

పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి 3వ తేదీ మధ్యాహ్నం విడుదల చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. 9552300009 నంబర్కు హాయ్ అని పంపిస్తే దాని ద్వారా వాట్సాప్ సేవలు > విద్యా సేవలు > SSC హాల్ టికెట్ > అప్లికేషన్ నంబర్ > చైల్డ్ ఐడీ, పుట్టిన తేదీ > స్ట్రీమ్ > కన్ఫర్మ్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
News March 3, 2025
పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

విశాఖలో ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షల నిర్వహణను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సోమవారం తనిఖీ చేశారు. విశాఖ ఉమెన్స్ జూనియర్ కాలేజీ, ఎసెంట్ జూనియర్ కాలేజీలలో పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించి పరీక్షల నిర్వహణ పరిశీలించారు. మొత్తం 38,879 మంది విద్యార్థులకు 38,478 మంది హాజరు కాగా 401 మంది గైర్హాజరయ్యారు.
News March 3, 2025
MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.