News February 6, 2025

సంగారెడ్డిలో తగ్గిన చికెన్ ధరలు

image

సంగారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ.220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ.210 నుంచి రూ.220, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

Similar News

News February 28, 2026

విశాఖ: మహిళా కార్పొరేటర్ల నిరసన.. టూర్ కావాలని డిమాండ్

image

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు వినూత్న డిమాండ్‌తో నిరసన తెలిపారు. కౌన్సిల్ గడువు ముగుస్తున్న తరుణంలో మేయర్ పీలా శ్రీనివాస్ ప్రతిపాదించిన స్పోర్ట్స్ మీట్‌ను వారు తిరస్కరించారు. తమను టూర్‌కు పంపాలని పట్టుబడుతూ పోడియంను చుట్టుముట్టారు. వీరి డిమాండ్‌కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు పలికారు. పార్టీలకు అతీతంగా మహిళా సభ్యులంతా ఏకమై ఈ నిరసనలో పాల్గొన్నారు.

News February 28, 2026

యుద్ధం.. పెరగనున్న బంగారం, వెండి ధరలు!

image

ఇరాన్-ఇజ్రాయెల్, US మధ్య యుద్ధం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడులను సురక్షితంగా భావిస్తారని, దీంతో వాటి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధం నేపథ్యంలో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. ఇక సోమవారం భారత మార్కెట్లు నష్టాల్లో కొనసాగవచ్చని, ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతారని పేర్కొన్నారు.

News February 28, 2026

RGM: ‘సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులే’

image

తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన SIలు నక్క శామ్యూల్, నూనె శ్రీనివాస్, ASI వెంకటేష్ బాబు, హెడ్ కానిస్టేబుళ్లు అలీముద్దీన్, విజయేందర్ రెడ్డి కుటుంబాలను ఆత్మీయంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన అధికారులు కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా ఉండాలన్నారు.