News February 6, 2025
సంగారెడ్డిలో తగ్గిన చికెన్ ధరలు

సంగారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ.220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్లెస్ KG రూ.210 నుంచి రూ.220, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.
News September 18, 2025
మంచిర్యాల: ‘RSS, BJPకి రైతాంగ సాయుధ పోరాట గొప్పతనం తెలీదు’

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని CPM కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్ట్లని అన్నారు. చరిత్రకు మతం రంగు పూసే RSS, BJPకి రైతాంగ సాయుధ పోరాట గొప్పతనం తెలియదని పేర్కొన్నారు.
News September 18, 2025
నిర్మల్: ఐటీఐ కళాశాలలో కాన్వోకేషన్ డే

నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఐటీఐ కళాశాలలో కాన్వోకేషన్ డేని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధి శాఖ కన్వీనర్ కోటిరెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఐటీఐ ఛైర్మన్ ఆదిత్య, ప్రిన్సిపల్ కృష్ణమూర్తితో కలిసి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్(గెస్ట్ ఆఫ్ హానర్), సెక్రటరీ చంద్రశేఖర్, మేనేజ్మెంట్, సిబ్బంది పాల్గొన్నారు.