News September 22, 2025

సంగారెడ్డిలో ప్రజావాణికి 33 ఫిర్యాదులు

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మొత్తం 33 మంది తమ సమస్యలను విన్నవించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ప్రజలకు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 23, 2025

రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల విధివిధానాలపై వారికి కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు

News September 23, 2025

లోకేశ్ అన్న.. నువ్వు ఇచ్చిన బూట్లు ఏమయ్యాయి: అంబటి

image

AP: బడి పిల్లలకు చెప్పులు కొనిపెట్టిన పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ <<17786148>>వెంకటరత్నం<<>> వీడియోను మంత్రి లోకేశ్ SMలో షేర్ చేసిన విషయం తెలిసిందే. దానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘లోకేశ్ అన్న.. నువ్వు ఇచ్చిన బూట్లు ఏమయ్యాయి? క్వాలిటీలేక పోయాయా? అసలు ఇవ్వకుండా మింగేశావా? ఏది ఏమైనా వెంకటరత్నం గారికి హాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు.

News September 23, 2025

సీఎం వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

image

రహదారి నిర్మాణ పనుల్లో ఆలస్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యకు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసుల్లో ఉన్నచోట్ల ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు పాల్గొన్నారు.