News March 28, 2025
సంగారెడ్డిలో మరో విషాదం..

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్గా గుర్తించారు. పైడిగుమ్మల్లోని వెంచర్లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 27, 2026
HYDలో మీటర్ల ‘మాయాజాలం’.. ₹450 కోట్ల SCAM..?

నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ.450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. టెండర్ల నిబంధనలు మార్చి మరీ ‘ఫేవరెట్’ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక పెద్దల హస్తం ఉందన్నది కాదనలేని సత్యం. అసలు తిమింగలాలు వేరే ఉన్నాయి.
News February 27, 2026
‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

2025-26 రబీ సీజన్కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 27, 2026
HYDలో మీటర్ల ‘మాయాజాలం’.. ₹450 కోట్ల SCAM..?

నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ.450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. టెండర్ల నిబంధనలు మార్చి మరీ ‘ఫేవరెట్’ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక పెద్దల హస్తం ఉందన్నది కాదనలేని సత్యం. అసలు తిమింగలాలు వేరే ఉన్నాయి.


