News February 28, 2025
సంగారెడ్డిలో మహిళ హత్య..UPDATE

సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 2, 2026
చైనాలో కండోమ్ ట్యాక్స్.. ‘ధరలు పెంచితే పిల్లలు పుట్టేస్తారా?’

కండోమ్లపై చైనా 13 శాతం పన్ను విధించింది. గర్భనిరోధక వస్తువులు, మందులపై ఈ ట్యాక్స్ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. గతంలో వన్ చైల్డ్ పాలసీ సమయంలో వీటికి మినహాయింపులు ఇచ్చింది. కానీ జననాల రేటు భారీగా పడిపోవడంతో గర్భనిరోధకాలను వాడకుండా పన్ను విధించింది. దీంతో ధరలు పెరిగితే పిల్లలు పుట్టేస్తారా అంటూ చైనా యువత SMలో సెటైర్లు వేస్తోంది. ‘ఏడాదికి సరిపడా ముందే కొనేశా’ అని ఓ యూజర్ పేర్కొన్నారు.
News January 2, 2026
ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో శ్రీహ సత్తా

మధురైలో ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ డిసెంబర్ 30న ఐదో సారి నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా 1,245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. గురువారం కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందన్నారు.
News January 2, 2026
ఎలాన్ మస్క్.. విరాళాల్లోనూ శ్రీమంతుడే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను విరాళాల్లోనూ శ్రీమంతుడేనని నిరూపించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) విలువైన 2.10 లక్షల టెస్లా షేర్లను తన ఫౌండేషన్కు డొనేట్ చేశారు. 2024లో 112 మిలియన్ డాలర్లు, 2022లో 1.95 బిలియన్ డాలర్లు, 2021లో 5.74 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఛారిటీకి ఇచ్చారు. తాజా డొనేషన్ తర్వాత కూడా 619 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఆయన కొనసాగుతున్నారు.


