News March 30, 2025
సంగారెడ్డి: అంబులెన్స్, ట్రాక్టర్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

వికారాబాద్ నుంచి సంగారెడ్డికి వస్తున్న అంబులెన్స్ SRD జిల్లా కొండాపూర్(M) మల్కాపూర్ శివారులో ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. వివరాలు.. VKB జిల్లా కోట్పల్లి(M) నాగ్సాన్ పల్లి వాసి మల్లమ్మకు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలిస్తున్నారు. మల్కాపూర్ సమీపంలో ట్రాక్టర్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో అంబులెన్స్ ఢీకొంది. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News October 28, 2025
పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్ప్రెస్), కోణార్క్ ఎక్స్ప్రెస్తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.
News October 28, 2025
ఇక ‘సింగూరు’ చిక్కులు లేకుండా ప్రభుత్వం చర్యలు

హానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు రిజర్వాయరుకు మరమ్మతులు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం సర్కారు రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు కానున్నాయి. ఈలోపు రిజర్వాయర్లో ఉన్న నీటిని ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు ఏళ్ల పాటు సింగూరుకు పనులు జరగుతాయి. ప్రస్తుతం సింగూరు నుంచి సిటీకి 7 TMCల నీరు ఉపయోగిస్తున్నారు.
News October 28, 2025
కర్ణాటక కాంగ్రెస్కు TDP కౌంటర్

AP: గూగుల్ డేటా సెంటర్పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.


