News March 21, 2025
సంగారెడ్డి: అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష

అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష పడిన ఘటన మునిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పుల్కల్ SI క్రాంతి తెలిపిన వివరాలు.. పుల్కల్కు చెందిన పూజితకు మునిపల్లి మండలం తక్కడపల్లికి చెందిన గొల్ల కృష్ణకు 2019 పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. తాగుడికి బానిసైన కృష్ణ 2023లో అత్త, భార్యపై దాడి చేశాడు. అత్త చంద్రకళకు తీవ్ర గాయాలై కొన్ని నెలలు కోమాలో ఉంది. పరారీలో ఉన్న కృష్ణను గురువారం రిమాండ్కు తరలించారు.
Similar News
News July 4, 2025
టెన్త్ విద్యార్థులకు బహుమతిగా సైకిళ్లు: బండి సంజయ్

TG: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ప్రధాని మోదీ 20వేల సైకిళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈనెల 11న తన బర్త్డే సందర్భంగా 8, 9 తేదీల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. KNR, SRCL, JGL, SDPT, HNK జిల్లాల్లోని విద్యార్థులకు వీటిని అందజేస్తామని తెలిపారు. ఒక్కో సైకిల్ ఖరీదు రూ.4వేలు అని, వాటిపై PM ఫొటో ఉంటుందని పేర్కొన్నారు.
News July 4, 2025
నిర్మల్: మైసంపేట్ పునరావాసంపై కలెక్టర్ దృష్టి

అటవీ చట్టాలను పాటిస్తూ గ్రామాలకు రహదారి, విద్యుత్, ఆరోగ్య సేవలు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా అటవీ కమిటీ సమావేశంలో ‘పరివేశ్’ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని ఆమె సూచించారు. కడెం మండలంలోని మైసంపేట్ను పునరావాస గ్రామంగా అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి మనీ ప్యాకేజ్, అటవీ హక్కుల చట్టం కింద సాగు భూములకు పట్టాలు అందించే ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు.
News July 4, 2025
అటవీ ప్రాంతాలకు మెరుగైన రవాణా: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లాలోని మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి అటవీ కమిటీ సమావేశంలో 16 రహదారి ప్రాజెక్టులపై చర్చించి, 9 ప్రాజెక్టులకు అటవీ అనుమతులు మంజూరు చేశారు. మిగిలిన 7 ప్రాజెక్టులకు డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని సూచించారు.