News October 8, 2025

సంగారెడ్డి: ‘అన్ని పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు’

image

జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతులకు అమలు చేసే విధంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News October 9, 2025

తెలుగు టైటాన్స్ ‘తగ్గేదేలే’.. వరుసగా ఐదో విజయం

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు హరియాణా స్టీలర్స్‌తో మ్యాచులో 46-29 తేడాతో విక్టరీ సాధించింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో 8 గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో భరత్ 20, విజయ్ మాలిక్ 8 పాయింట్లు సాధించారు. పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ, పుణెరి పల్టాన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.

News October 9, 2025

గుర్తుంచుకోండి.. మీ కర్మలకు మీరే బాధ్యులు!

image

ఒకప్పుడు దొంగగా ఉన్న బోయవాడు ‘నా పాపంలో భాగం పంచుకుంటారా’ అని కుటుంబసభ్యులను అడిగితే.. వాళ్లు ‘వద్దు’ అని తేల్చి చెప్పారు. ఆ మాటకు జ్ఞానోదయం పొందిన ఆ బోయవాడు నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని పఠించి, పాప విముక్తుడై వాల్మీకిగా మారి, రామాయణాన్ని రచించాడు. లోకం కూడా అంతే! ఎప్పుడూ తన లాభాలనే చూస్తుంది. మన కర్మలకు మనమే బాధ్యులమవుతాం. ఈ సత్యాన్ని తెలుసుకొని మంచి మార్గంలో పయనిస్తేనే ఆయనలా మహర్షులం అవుతాం.

News October 9, 2025

భద్రాద్రి: శాంతి చర్చలకు సిద్ధమే: మావోయిస్టు పార్టీ

image

రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం తమతో చర్చలు జరపడానికి చొరవ తీసుకోవాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమైఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సోను (అభయ్) చేసిన శాంతి ప్రతిపాదనను సికస సమర్థిస్తుందని అశోక్ స్పష్టం చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.