News December 16, 2025

సంగారెడ్డి: అమ్మో చలి

image

సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. మంగళవారం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 12.2 డిగ్రీలు, గుమ్మడిదలలో 13.6 డిగ్రీలు, అమీన్‌పూర్‌లో 14.7° డిగ్రీలు, రామచంద్రాపురంలో 15.1 డిగ్రీలు, పటాన్ చెరులో 11.5° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 89.4%గా ఉంది. ఉదయం పూట చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను కాచుకుంటున్నారు.

Similar News

News December 19, 2025

పల్నాడు: నిరుపయోగంగా సంపద కేంద్రాలు

image

పల్నాడు జిల్లాలో పంచాయతీల ఆదాయం పెంచేందుకు టీడీపీ ప్రభుత్వంలో సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో వందలాది గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వీటిని వినియోగించడంలో అధికారులు పట్టనట్లుగా ఉండటంతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం అధికమైంది. వీధుల్లో సేకరించిన చెత్త శివారు ప్రాంతాల్లో పడేస్తున్నారు.

News December 19, 2025

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర (SASA) ప‌క్కాగా నిర్వ‌హించాలి: విశాఖ కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాల‌ను ప‌క్కాగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 3వ శనివారం విశాఖలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అంశంపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాల‌ని సూచించారు. స్వయం సహాయక సంఘాలు (SHGలు), స్టార్టప్‌లు, స్థానిక వ్యాపారులు అభివృద్ధి చేసిన రీసైకిల్, అప్‌సైకిల్, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రదర్శించాల‌న్నారు.

News December 19, 2025

‘వీబీ-జీ రామ్‌ జీ’తో కనీస వేతనాలకు ముప్పు!

image

MGNREGA పేరును ‘వీబీ-జీ రామ్‌ జీ’గా మార్చిన కేంద్రం వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులు నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. అయితే ఈ పథకం వల్ల ప్రైవేటు వ్యక్తులు కూలీలకు అంతకన్నా మెరుగైన వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు సీజన్లో పథకం నిలిపివేస్తే ప్రైవేటు మోనోపలీ పెరిగి కనీస వేతనాలు దక్కవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రబీ, ఖరీఫ్ వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత తీరుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.