News August 25, 2025
సంగారెడ్డి: ఇన్స్పైర్కు స్పందన నామమాత్రం

విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ఇన్స్పైర్ అవార్డు నామినేషన్ల పై ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. రెండు నెల క్రితం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 2,500 మంది విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు 255 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేశారు. చివరి తేదీ సెప్టెంబర్ 15 లోపు దరఖాస్తులు చేయించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు.
Similar News
News August 25, 2025
అలాంటి కేబుల్స్ తొలగించొచ్చు: హైకోర్టు

TG: హైదరాబాద్లో స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్ <<17483930>>తొలగించవచ్చని <<>>హైకోర్టు పేర్కొంది. కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను GHMC, విద్యుత్ శాఖ తొలగిస్తుండటంపై ఎయిర్టెల్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి తీసుకున్న వాటిని కూడా తొలగిస్తున్నారని ఆ సంస్థ కోర్టుకు వివరించగా అనుమతుల వివరాలివ్వాలని TGSPDCL లాయర్ ఎయిర్టెల్ను కోరారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
News August 25, 2025
39 మంది కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు.. సీపీ అభినందన

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 39 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి పొందారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా వారికి ఉద్యోగోన్నతుల చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, సేవాస్ఫూర్తికి గుర్తింపుగా ఈ పదోన్నతి లభించిందని అన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
News August 25, 2025
వైద్యో నారాయణో హరి.. ఈయన వారికి దేవుడే!

వైద్యం వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో బెంగళూరు సమీపంలో ఉండే బెగుర్ గ్రామంలో 50+ఏళ్లుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డాక్టర్ రమణా రావు. 1973లో కొద్దిమంది రోగులతో ప్రారంభమైన ఆయన సేవలు ప్రతి ఆదివారం వేల మందికి ఆశాదీపంగా మారాయి. ఎలాంటి రుసుము తీసుకోకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. వర్షాలు, అనారోగ్యం, కరోనా వంటివి కూడా ఆయన సేవలను ఆపలేకపోయాయి. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.