News March 30, 2025
సంగారెడ్డి: ఉగాది ఆధ్యాత్మిక ఆనందం: అవధూత గిరి

ప్రశాంతతకు ప్రకృతికి నిలయమైన బర్దిపూర్ దత్త క్షేత్రంలో ఆదివారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలుగు ప్రజలకు శ్రీ విశ్వ వసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News July 6, 2025
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

TG: తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 2.50 లక్షల ఇళ్ల పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. కొత్తగూడెంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల జారీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులైనా, ఇళ్లు రానివారు నిరుత్సాహపడొద్దన్నారు. రాబోయే రోజుల్లో మిగతావారికి విడతలవారీగా కేటాయిస్తామని తెలిపారు. BRSలా ఊహజనిత మాటలు తాము చెప్పబోమన్నారు.
News July 6, 2025
మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారా?

టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ‘<<16960204>>అమెరికా పార్టీ<<>>’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన భవిష్యత్తులో అగ్రరాజ్య అధ్యక్షుడు అవుతారా? అనే చర్చ మొదలైంది. అయితే US రాజ్యాంగం ప్రకారం మస్క్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. ఆర్టికల్ 2లోని సెక్షన్ 1 ప్రకారం ప్రెసిడెంట్ అభ్యర్థి కావాలంటే USలోనే జన్మించాలి. కానీ ఈ అపర కుబేరుడు సౌతాఫ్రికాలో జన్మించారు. దీంతో మస్క్ మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టాల్సిందే.
News July 6, 2025
HYD: గ్రేటర్లో 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

గ్రేటర్ HYD పరిధిలో మొత్తం 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క కేంద్రానికి సుమారు ఎకరా స్థలం అవసరం ఉందని, ప్రస్తుతం స్థలాల ఎంపిక కొనసాగుతుందని, అనువైన స్థలం దొరకని కారణంగా లేట్ అవుతున్నట్లు సంయుక్త రవణ శాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనం ఎక్కాలంటే ఈ ఆటోమేటిక్ స్టేషన్లలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది.