News February 12, 2025

సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. అలర్ట్‌గా ఉండండి: ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, క్రికెట్ కిట్లు పంపిణీ చేయకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News February 13, 2025

సంగారెడ్డి: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.

News February 13, 2025

ఉన్నత స్థానంలో స్థిరపడాలి: అడిషనల్ కలెక్టర్

image

ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకాంక్షించారు. హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై మెనూ పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల బాగోగులు తెలుసుకున్నారు.

News February 13, 2025

KMR: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ ఔట్

image

నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రామలింగంను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఓబీసీ విభాగం ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

error: Content is protected !!