News March 4, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు.. అంజిరెడ్డి ముందంజ

కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. 4వ రౌండ్ అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 30,961ల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 25,363ల ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 21,248ల ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,598ల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్రాజ్ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్రాజ్ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
News November 12, 2025
బీజాపూర్ అడవుల్లో కాల్పుల మోత!

ఛత్తీస్గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతాల్లో రెండు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ మద్దేడ్ ఏరియా కమిటీ, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మద్దేడ్ ఏరియా కమిటీ ఇన్ఛార్జితో బుచ్చన్నతో పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ మృతి చెందారు. ఈ విషయాన్ని బీజాపూర్ పోలీసులు ధ్రువీకరించారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.


