News March 26, 2025

సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు నెల 31లోగా పీజీ చెల్లించాలని కలెక్టర్ వల్లురు క్రాంతి సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ. మున్సిపాలిటీ, పంచాయతీల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రచారం చేయాలని చెప్పారు. ఈ నెల31లోగా చెల్లించిన వారికి 25% డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. 100% ఫీజు చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 28, 2026

జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్‌లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.

News February 28, 2026

విశాఖ మీదుగా రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-కొల్లాం (18501) మంగళవారాల్లో, చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ (17065) మంగళవారాల్లో నడుస్తాయి. ఇవి విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి. త్వరలోనే వీటి ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ తెలిపారు.

News February 28, 2026

దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త!

image

AP: ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని APSDMA తెలిపింది. సెంట్రల్ ఆంధ్రలో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీస్తాయంది. ఎండతీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు క్యాప్, కర్చీఫ్, తెలుపు రంగు వస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పింది. అలాగే వేసవి తాపం తగ్గించుకోవడానికి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలని సూచించింది.