News February 25, 2025
సంగారెడ్డి: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Similar News
News February 25, 2025
పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి శోభ

పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలో కొమరాడ మండలంలో గుంప సోమేశ్వర ఆలయం, సాలూరు సమీపంలో పారమ్మకొండ, పార్వతీపురం సమీపంలో గల అడ్డాపుశీల, మక్కువ సమీపంలో గలగల ఉమా శాంతేశ్వర ఆలయం, ములక్కాయవలస ఆలయాలతో పాటు పలు ఆలయాలు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఉన్న శివాలయాలను కామెంట్ చేయండి.
News February 25, 2025
MNCL: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ

మంచిర్యాల జిల్లాలోని రైతుల ఖాతాల్లో 19వ విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు నగదు జమ చేసింది. జిల్లాలోని అర్హులైన రైతులకు ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17వ విడతలో 55,658 మంది రైతులకు, 18వ విడతలో 40,534 మంది ఖాతాల్లో నగదు జమ కాగా.. ఈ విడతలో 56 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో జమ కానుంది.
News February 25, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: బండి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ బీజేపీనే గెలుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసి CM హడావుడిగా ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతోందని దుయ్యబట్టారు. కులగణన తప్పుగా సాగిందని, 32శాతమే రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు.