News March 21, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 7 నుంచి 15 వ తేదీ వరకు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మూల్యాంకనం విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
Similar News
News March 2, 2026
ప్రజావాణి దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టండి: కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 83 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెండింగ్ దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు
News March 2, 2026
పెండింగ్ స్కాలర్షిప్లు, ఉపాధి హామీపై కలెక్టర్ సీరియస్

జిల్లాలో రానున్న కఠిన వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్షణమే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News March 2, 2026
మేం సేఫ్: మంచు విష్ణు

ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల దుబాయ్లో చిక్కుకుపోయిన టాలీవుడ్ యాక్టర్ <<19266979>>మంచు విష్ణు<<>> తన ఫ్యామిలీ సేఫ్ అని కన్ఫర్మ్ చేశారు. ‘మేమంతా దుబాయ్లో సేఫ్గా ఉన్నాం. అప్పుడప్పుడు దూరంగా శబ్దాలు వినిపిస్తున్నా.. ఇక్కడ లైఫ్ నార్మల్ గానే ఉంది’ అని ట్వీట్ చేశారు. ఇంతటి టెన్షన్ టైమ్లోనూ UAE ప్రభుత్వం చూపిస్తున్న లీడర్షిప్, ఇక్కడి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు.


