News December 27, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలు పొందిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును జనవరి 5 వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఈ 5వ తేదీలోగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర పూర్తి వివరాల కోసం తమ పరిధిలోని అధ్యయన కేంద్రాల నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 19, 2026
అమరావతిలో మిగిలిన భూముల సేకరణ

అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా 2,459 ఎకరాల భూమి పూలింగ్కు రాలేదు. అయతే భూసేకరణ నోటిఫికేషన్ విడుదలకు ముందే రైతులు ముందుకొస్తే, వారికి ల్యాండ్ పూలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 19, 2026
పట్టిసీమ భద్రకాళి వీరేశ్వర స్వామిని దర్శించిన శేఖర్ మాస్టర్

పోలవరం పట్టిసీమ శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామిని సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అర్చనలు చేసి ఆశీర్వాదాలు పొందారు. శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనతో సెల్ఫీలు దిగారు.
News February 19, 2026
కర్నూలు: ప్రేమ విషయమై గొడవ.. బలవన్మరణం

ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన మహేశ్(20) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ‘మహేశ్ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనై మేడపై ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు’ అని మూడో పట్టణ ఎస్ఐ రామస్వామి తెలిపారు.


