News February 1, 2025
సంగారెడ్డి: గంజాయి అమ్మి జైలు పాలయ్యాడు

గంజాయి అమ్మిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ జడ్జి జయంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2009 సంవత్సరంలో సంగారెడ్డిలో 5 కిలోల గంజాయి విక్రయిస్తూ మహమ్మద్ సెమీ అన్సారి అలియాస్ బిలాల్ను అప్పటి ఎక్సైజ్ సీఐ మధుబాబు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. జైలు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేసిన మధుబాబును అభినందించారు.
Similar News
News January 7, 2026
అక్కడ బీజేపీ-MIM పొత్తు

అంబర్నాథ్(MH)లో BJP, కాంగ్రెస్ <<18786772>>పొత్తు<<>> దుమారం రేపగా, అకోలాలో BJP-MIM కలిసిపోవడం చర్చనీయాంశమవుతోంది. అకోలా మున్సిపల్ కౌన్సిల్లో 33 సీట్లకు ఎన్నికలు జరగ్గా BJP 11, కాంగ్రెస్ 6, MIM 5, మిగతా పార్టీలు 11 చోట్ల గెలిచాయి. ఈ క్రమంలో MIM, ఇతర పార్టీలతో కలిసి కూటమిని BJP స్థానిక యూనిట్ ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే MIMతో పొత్తును అంగీకరించబోమని CM ఫడణవీస్ స్పష్టం చేశారు.
News January 7, 2026
ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఆయన వీసీ ద్వారా నిర్వహించారు. రహదారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.
News January 7, 2026
ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కొప్పుల ఈశ్వర్

జగిత్యాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల క్రితం తమ చేతుల మీదగా ప్రారంభించిన ఎస్సీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసీఆర్ పాలనలో స్టడీ సర్కిల్ కేంద్రాలు విజయవంతంగా నడిచాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. గతంలో స్టడీ సర్కిల్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేశాయని అన్నారు.


