News May 25, 2024
సంగారెడ్డి: గొర్రెల యూనిట్ల డబ్బులు వాపస్!

గొర్రెల యూనిట్ల పంపిణి పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టినట్లుంది. సంగారెడ్డి జిల్లాలో గతంలో గొర్రెల యూనిట్ల కోసం గొర్రెల కాపరులు తమ వాటాగా చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలని అన్నారు. ఇప్పటి వరకు 1,195 మంది లబ్ధిదారులకు మాత్రమే వాటా డబ్బులు వాపస్ ఇవ్వాలని అనుకున్నారు. వీరిలో ఒకరికి వాటా డబ్బులను తిరిగి ఇచ్చేశారు. మరో 257 మందికి డబ్బులు వాపస్ తిరిగి ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.
Similar News
News February 28, 2026
మెదక్లో సినిమా షూటింగ్ సందడి

చిన్నశంకరంపేట మం.జంగరాయి పరిసరాల్లో శివాని ప్రొడక్షన్స్ బ్యానర్పై ‘బుల్లెట్ బండి’ సాంగ్ షూటింగ్ సందడిగా జరిగింది. డైరెక్టర్ అరవింద్ దర్శకత్వంలో హీరో సంతోష్, నటులు అలీ గడ్డం, మహిపాల్, సుమిత్ర, అంజిరెడ్డి పాల్గొన్నారు. నిర్మాత శివాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రానికి మను కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రకృతి దృశ్యాల మధ్య జరుగుతున్న ఈ చిత్రీకరణను గ్రామస్థులు ఆసక్తిగా వీక్షించారు.
News February 28, 2026
MDK: హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరి: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్లో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ గౌరవ వందనం స్వీకరించి సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్నెస్ ప్రాముఖ్యత వివరించారు. “Arrive Alive – 2026”లో భాగంగా హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరి అని, అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సేవలందించిన సిబ్బందిని అభినందించి, యువతలో రోడ్డు భద్రత అవగాహన పెంచాలని సూచించారు.
News February 28, 2026
మెదక్: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.


