News September 20, 2025
సంగారెడ్డి: జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. భూ సేకరణలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ భూముల అనుమతి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో వైభవంగా రుద్రహోమం
✓ భద్రాద్రి: తల్లీ, కుమారుడు అదృశ్యం
✓ మణుగూరు: ఈవోతో భక్తుల వాగ్వాదం..!
✓ అశ్వారావుపేట సొసైటీ సీఈవో సస్పెన్షన్
✓ అశ్వారావుపేట పోలీసులపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు
✓ సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వాలని సీఎంకు కొత్తగూడెం ఎమ్మెల్యే వినతి
✓ మణుగూరు: డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
✓ కొత్తగూడెం: గంజాయి విక్రయదారుల అరెస్ట్
News September 21, 2025
కృష్ణా: ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..!

జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 3 వ్యక్తులు ఎమ్మెల్యేలుగా పాలన నడుస్తోంది. JSP MLA, ఆయన కుమారుడు, అల్లుడు వేర్వేరుగా వ్యవహారాలు చూసుకుంటున్నారు. అల్లుడు వ్యాపారం, కొడకు కేడర్, MLA అధికారులను డీల్ చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవులు మాత్రం టీడీపీ నేతలకే దక్కుతున్నాయని జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు వాపోతున్నట్లు సమాచారం.
News September 21, 2025
పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో నిర్వహించబోయే పోషణ మాసోత్సవాలను విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం పోషణ మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఛాంబర్లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నెలరోజుల పాటు కొనసాగనున్న మాసోత్సవాలలో గ్రామస్థాయిలో గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని అన్నారు.