News April 10, 2025

సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్.. నేడు భారీ వర్షం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్‌లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News October 23, 2025

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం

image

భీమడోలులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16 కురెళ్ళగూడెం నుంచి భీమడోలు వైపు వెళ్లే రోడ్డు మార్గం పక్కన మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి సుమారు 30-40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న భీమడోలు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

News October 23, 2025

సముద్ర మట్టం పెరిగితే 282 గ్రామాలు ముంపు

image

AP: దేశంలో తుఫాన్లు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో ఏపీ ఒకటి. వీటివల్ల ఏటా ప్రాణ, ఆస్తి నష్టమూ ఎక్కువే. సముద్ర మట్టం పెరుగుదలతో రానున్నకాలంలో ఏపీలోని 282 తీర గ్రామాలు ముంపుబారిన పడొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10L మందిని తరలించాల్సి రావచ్చంటున్నారు. ఇప్పటికే 32% తీరప్రాంతం కోతకు గురవుతున్నట్లు గుర్తించిన GOVT దీన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతోంది.

News October 23, 2025

చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

image

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.