News April 15, 2025

సంగారెడ్డి: జిల్లాకు చేరుకుంటున్న పాఠ్య పుస్తకాలు

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నట్లు పాఠ్య పుస్తకాల మేనేజర్ తెలిపారు. జిల్లాకు 9.86 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 20,710 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి వచ్చాయని, మిగతా పుస్తకాలు ఈ నెల ఆఖరు వరకు వస్తాయని పేర్కొన్నారు. పూర్తిగా పాఠ్య పుస్తకాలు రాగానే మండలాలకు పంపిణీ చేయనున్నట్లు మేనేజర్ చెప్పారు.

Similar News

News November 4, 2025

VZM: విజేతలను అభినందించిన ఎస్పీ

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులను తన కార్యాలయంలో SP దామోదర్ అభినందించారు. ప్రథమ బహుమతిగా రూ.2వేలు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయంగా రూ.1000 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన పెంపొందించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలని సూచించారు.

News November 4, 2025

గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పీఎం ఉజ్వల యోజన కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భైర్లూటి గూడెం, గులాం అలియాబాద్ తాండాలలో ఏర్పాటైన నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>