News January 10, 2026
సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీ

సంగారెడ్డి జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ అయ్యారు. వీరిలో నలుగురు తహశీల్దార్లతోపాటు ఆరుగురు డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు. పలువురు అధికారులను మండలాలు, కలెక్టరేట్ కార్యాలయానికి కేటాయించగా మరికొందరిని ఆర్డీవో కార్యాలయాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 9, 2026
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

AP: అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ జీవో జారీ చేసింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎన్విడియా కంపెనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచే వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే తొలి ఏఐ వర్సిటీగా నిలవనుంది.
News February 9, 2026
దీపారాధనలో ఎన్ని వత్తులు పెట్టాలి?

దీపారాధనలో వత్తుల సంఖ్యకు శాస్త్రపరంగా ప్రాముఖ్యత ఉంది. నిత్య దీపారాధనలో ఏకవత్తి పెట్టకూడదు. ఒకే వత్తిని అశుభ సమయాల్లో మాత్రమే వాడతారు. సామాన్యంగా ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కనీసం 2 వత్తులు కలిపి వేయడం శుభప్రదం. దీనిని ‘దంపతి వత్తి’ అని కూడా అంటారు. రెండుకు మించి ఇంకా ఎన్ని వత్తులైనా పెట్టవచ్చు. అందుకు ఎలాంటి నియమాలు లేవు. 108 వత్తుల దీపం వెలిగిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం.
News February 9, 2026
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


