News March 13, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.
Similar News
News January 2, 2026
రోజ్ ఆయిల్తో ఎన్నో లాభాలు

గులాబీ నూనెకు యాంటీసెప్టిక్, యాస్ట్రిజెంట్ గుణాలు ఎక్కువ. వేడినీటిలో కాస్త రోజ్ ఆయిల్ని వేసి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మం తేమగా మారుతుంది. వెన్న, బ్రౌన్ షుగర్, రోజ్ ఆయిల్ కలిపి శరీరానికి రాసుకుంటే ఇది సహజసిద్ధమైన స్క్రబ్లా పనిచేస్తుంది. ఆలివ్, రోజ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజ తేమను పొంది, బలంగా మారుతుంది.
News January 2, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు(2/2)

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.
News January 2, 2026
కొత్తగూడెం: “ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం”

భద్రాద్రి జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్కి ఆర్థిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్కి రూ.75,000 చొప్పున మొత్తం 8 యూనిట్లకు 100% సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ wdsc.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలన్నారు.


