News March 3, 2025
సంగారెడ్డి: జిల్లాలో రెండు ఆస్పత్రులపై చర్యలు

జహీరాబాద్లోని నీలం, సంగారెడ్డిలోని వెల్ నెస్ హాస్పిటల్లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి ఆదివారం తెలిపారు. బాలింత మహానంది మరణంతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల వివరాలు సేకరించినట్లు చెప్పారు. వెల్నెస్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
ధర్మారం: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

ధర్మారం కటికెనపల్లికి చెందిన బోనగిరి వెంకటేశం ఇంట్లో జరిగిన చోరీ కేసులో గడమల్ల సదన్ కుమార్(19)ను అరెస్ట్ చేసినట్లు SI ప్రవీణ్ తెలిపారు. వెంకటేశం OCT 25న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవారం ఇంటికొచ్చే సరికి చోరీ జరిగిందని గుర్తించి PSలో ఫిర్యాదు చేశాడు. విచారణలో సదన్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బంగారు, వెండి నగలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ చేసినట్లు SI చెప్పారు.
News November 7, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో జాతీయ గీతాలాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన పాల్గొని వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్య్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను అధికారులు స్మరించుకున్నారు.
News November 7, 2025
వందేమాతరం దేశస్ఫూర్తికి ప్రతీక: SP

వందేమాతరం గేయం 150 ఏళ్ల వేడుకలను తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో సిబ్బందితో కలిసి వందేమాతరం ఆలపించారు. దేశభక్తితో నిండిన ఈ వేడుకలో ఎస్పీ మాట్లాడుతూ.. వందేమాతరం మన దేశస్ఫూర్తికి ప్రతీక అన్నారు. ప్రతి భారతీయుడు ఈ గేయాన్ని తమ హృదయంలో నిలుపుకోవాలని ఆయన కోరారు.


