News March 10, 2025

సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2025

CM చంద్రబాబుపై భూమన విమర్శలు

image

CM చంద్రబాబుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సంక్షేమాన్ని అందివ్వడంలో లేదని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు. విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలు వారిని బయటికి పంపిస్తున్నారని మండిపడ్డారు. 4లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని భూమన ఎద్దేవా చేశారు.

News March 10, 2025

మల్యాల: మిస్సింగ్ అయిన మహిళ మృతి

image

మిస్సింగ్ అయిన ఓ మహిళ మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్‌లో లభ్యమైంది. ఎస్ఐ నరేశ్ కుమార్ కథనం మేరకు.. మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన జైసేట్టి వెంకవ్వ(50) ఈ నెల 6న రాత్రి 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని భర్త గంగన్న ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆదివారం జగిత్యాల మండలం అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో వెంకవ్వ మృతి చెంది కనిపించింది.

News March 10, 2025

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళా

image

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు డీసీసీ కార్యదర్శి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం పరిగిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని వెల్లడించారు.

error: Content is protected !!