News December 30, 2025

సంగారెడ్డి జిల్లాలో 4,852 మెట్రిక్ టన్నుల యూరియా: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో యాసంగి అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా ఎరువులు పంపిణీ జరిగేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 4,852 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు.

Similar News

News December 30, 2025

NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

image

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ ‌న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్‌కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT

News December 30, 2025

నూతన వేడుకలను సంతోషంగా నిర్వహించుకోండి: SP

image

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సంతోషంగా నిర్వహించుకోవాలని SP సతీష్ కుమార్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. మద్యం తాగి వాహనాలను నడిపితే మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 185 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసి, పూర్తిగా రద్దు చేస్తామన్నారు.

News December 30, 2025

మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలి: కలెక్టర్

image

జిల్లాలోని చెంచు గిరిజనులకు మెరుగైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన ఉత్పత్తులపై శిక్షణ, జీవనోపాధి అవకాశాలపై సమావేశం నిర్వహించారు. డీఎఫ్‌ఓ విఘ్నేష్, డీఆర్‌ఓ రామునాయక్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.