News March 7, 2025
సంగారెడ్డి: జిల్లా ఎస్పీ రూపేశ్ బదిలీ

సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నా చెన్నూరి రూపేశ్ను నార్కోటిక్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పారితోష్ పంకజ్ను నియమించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.
Similar News
News July 6, 2025
ఖమ్మం: కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా.. కారణమిదేనా?

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన హాట్ టాపిక్గా మారింది. ఆమె పర్యటనలో పార్టీ కీలక నేతలు పువ్వాడ అజయ్, కందాల, సండ్ర, వద్దిరాజు రవిచంద్ర, తాత మధు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్లో తనకు కేసీఆర్ తప్పా మరో లీడర్ లేరని కవిత చేసిన కామెంట్స్ వల్లే ఆపార్టీ నేతలంతా దూరంగా ఉన్నారనేది టాక్. ఆమె పర్యటనలో జిల్లా నేతలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
News July 6, 2025
చివరికి కల్లు కాంపౌండుకు రమ్మంటారా ఏంటి..?: జగ్గారెడ్డి

‘రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు కేసీఆర్ను అసెంబ్లీకి ఆహ్వానిస్తే ప్రెస్ క్లబ్, బోట్స్ క్లబ్కు రావాలని.. అక్కడ చర్చిద్దామని కేటీఆర్ అంటున్నాడు. చివరికి కల్లు కాంపౌండుకు రావాలని పిలుస్తారా ఏంటి?’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. CM రేవంత్.. కేసీఆర్ను పిలుస్తుంటే సెకెండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని గాంధీభవన్లో విమర్శించారు.
News July 6, 2025
సంగారెడ్డి జిల్లాలో మూడు డెంగ్యూ కేసులు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలోని సోమేశ్వర వాడలో ఒకటి, ఇస్నాపూర్లో ఒకటి, రామచంద్రపురం పరిధిలోని వెలిమెల గ్రామంలో ఒకటి నమోదు అయ్యానని పేర్కొన్నారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.