News March 25, 2025

సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

image

హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

10వ తేదీ జోగులాంబ ఆలయంలో కార్తీక సంబరాలు

image

ఈనెల 10వ తేదీ అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పరంపర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరపత్రికను విడుదల చేసింది. ఆలయాల వైభవం ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు ఉట్టిపడేటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంబరాలు చోటుచేసుకొనున్నాయి.

News November 6, 2025

పెద్దపల్లి: ఆరోగ్యం కుదుటపడట్లేదని మహిళ సూసైడ్

image

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన గుండ లలిత(45) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆమె గత మూడేళ్లుగా షుగర్‌, లివర్‌, ఇతర వ్యాధులతో బాధపడుతోంది. వీటికి చికిత్స పొందుతున్నా ఎంతకీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి మృతి చెందింది. భర్త గుండ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News November 6, 2025

వరంగల్: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం!

image

కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.45 లక్షలు వసూలు చేసిన ఘటన WGL జిల్లా నల్లబెల్లిలో ఆలస్యంగా బయటపడింది. ఖమ్మం, మంచిర్యాల, కోరుట్లకు చెందిన వ్యక్తులు స్థానిక మధ్యవర్తి సహకారంతో ముచ్చింపుల, రంగాపురం, గుండ్లపహాడ్, నల్లబెల్లి గ్రామాల నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10-15 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు డబ్బు అడిగినప్పటికీ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.