News February 7, 2025
సంగారెడ్డి: డబుల్ డెక్కర్ రైలును చూశారా..!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో డబుల్ డెక్కర్ రైలు నిలిచింది. చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ డబుల్ డెక్కర్ రైలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి వెళుతుండగా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. దాంతో ఇక్కడి ప్రాంత ప్రజలు అరుదైన డబుల్ డెక్కర్ రైలును ఆసక్తిగా తిలకించారు. స్టేషన్లోని ప్యాసింజర్లు ప్లాట్ ఫామ్ వద్ద డబుల్ డెక్కర్ రైలుతో సెల్ఫీ ఫోటోలు దిగి సందడి చేశారు.
Similar News
News February 8, 2025
హన్మకొండ జిల్లాలో టాప్ న్యూస్ 2/2
* KUలో ఉద్రిక్తత.. చితకబాదుకున్న విద్యార్థులు!
* పరకాలలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన పీడీఎస్ బియ్యం
* త్యాగరాజ కీర్తనలు పాడిన HNK కలెక్టర్ ప్రావీణ్య
* ఉప్పల్లో మూడో రోజు కొనసాగిన ఆందోళన!
* పర్వతగిరి: ఖాళీ అవుతున్న చెక్ డ్యామ్లు.. పట్టించుకోండి!
* హనుమకొండలో ACB సోదాలు
* విద్యార్థులతో కలిసి భోజనం చేసిన HNK కలెక్టర్
News February 8, 2025
130 కి.మీ వేగంవెళ్లేలా రైల్వేట్రాక్ అప్గ్రేడ్
విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.
News February 8, 2025
దిలావార్ పూర్: విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్ల బందోబస్తు పరిశీలన
ఈ నెల 8న నిర్వహించనున్న ధ్యాన హనుమాన్ భారీ శిల్ప విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్, ఉపేందర్ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వచ్చే భక్తులు వాహనాలు, సౌకర్యాలను తదితర విషయాలను కార్యక్రమా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.