News April 9, 2025

సంగారెడ్డి: తల్లిని వేధిస్తున్నాడని చంపేశాడు

image

SRD జిల్లా మొగుడంపల్లి మం. ధనశ్రీలో జరిగిన మహమ్మద్ అబ్బాస్ అలీ(25) <<16017699>>హత్య<<>> కేసును చిరాగ్‌పల్లి పోలీసులు ఛేదించారు. DSP రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు.. తన తల్లిని అబ్బాస్ వేధిస్తున్నాడని ఈనెల 6న ఖలీల్ షా, తన స్నేహితుడు మమ్మద్ బిస్త్‌తో కలిసి హత్య చేశారు. అడ్డొచ్చిన షేక్ అక్బర్ అలీపై బాటిల్‌తో దాడి చేశారు. నిందితులు పారిపోతూ అటుగా వచ్చిన మరో వ్యక్తిని గన్‌తో బెదిరించి అతడి బైక్‌పై పారిపోయారు.

Similar News

News September 11, 2025

మెదక్: బోధనా నాణ్యత పెరగాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి FLN, TLM బోధన అభ్యసన మేళాను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడం కోసమే బోధన అభ్యసన మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేళాలో 21 మండలాల నుంచి 1-5 తరగతుల ఉపాధ్యాయులు పాల్గొనగా ఎనిమిది మంది టీచర్స్ రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యారు.

News September 10, 2025

కళా నైపుణ్యాలను వెలికితీయడానికే కళా ఉత్సవ్​: డీఈవో

image

విద్యార్థుల్లో దాగి ఉన్న కళానైపుణ్యతను వెలికితీయడానికే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్​ పోటీలను నిర్వహిస్తున్నట్లు​ జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రొఫెసర్​ రాధాకిషన్​ అన్నారు. బుధవారం మెదక్​ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ్​ ప్రారంభించారు. డీఈవో​ మాట్లాడుతూ.. విద్యార్థులలో కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.

News September 10, 2025

తూప్రాన్: ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

image

తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. మనోహరాబాద్ మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, రోగులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్‌కు సూచించారు.