News October 9, 2025

సంగారెడ్డి: నామినేషన్ వేద్దామా.. వేచి చూద్దామా?

image

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రభత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్ట్ మెట్లు ఎక్కగా, కోర్టు కేసును గురువారం మధ్యాహ్నం 2:15కు వాయిదా వేసింది. కొత్త రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా అనే డైలమాలో ఆశావహులున్నారు. సంగారెడ్డి జిల్లాలో NKD, ZHB డివిజన్‌లో నేడు నామినేషన్ వేద్దామా, వేచిచూదమా? అనే సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు.

Similar News

News October 9, 2025

యాదాద్రి: కోతులను మాస్కులతో తరిమేస్తున్నారు.!

image

అడ్డగూడూరు మండలం కోటమర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిత్యం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో కోతులు విరుచుకుపడుతూ, దాడులు చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విద్యార్థులు గురువారం చింపాంజీ, సింహం ఆకారంలో ఉన్న మాస్కులు ధరించి, కోతులను తరిమికొట్టేందుకు వినూత్నంగా యత్నించారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

News October 9, 2025

వైసీపీ నాయకులు చేసిన తప్పే టీడీపీ నేతలు చేస్తున్నారా?

image

YCP గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంలో కొందరు నాయకుల అసభ్యకర వ్యాఖ్యలే కారణమనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అదే విధానాన్ని <<17940542>>TDPలో కొందరు ఎమ్మెల్యేలు<<>> అవలంభిస్తున్నారనే చర్చ మొదలైంది. కొడాలి, అంబటి, రోజా, వంశీ వంటి నాయకులు గతంలో అసభ్య పదజాలంతో మాట్లాడేవారు. జీడీ నెల్లూరు <<17949084>>ఎమ్మెల్యే థామస్<<>> చేసిన వ్యాఖ్యలు ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇలాంటి బూతు రాజకీయాలు మానుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.

News October 9, 2025

వనపర్తి: ఈవీఎం గోదాము పరిశీలన

image

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు, వీవీప్యాట్‌ గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయం వెనుక ఉన్న గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ (ఎన్నికల సంఘం) మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు.