News March 13, 2025
సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
గుంటూరులో ఫైనాన్స్ కంపెనీ భారీ మోసం

ఐదున్నర కిలోల బంగారం తాకట్టు పెడితే కేవలం వెయ్యి గ్రాములే అని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పత్రాలు సృష్టించి ఓ వైద్యురాలిని మోసం చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముత్యాలరెడ్డి నగర్కి చెందిన ఓ వైద్యురాలు అరండల్పేటలోని ఓ ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలో ఐదున్నర కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సంస్థలో పనిచేసే ఐదుగురు సిండికేట్గా ఏర్పడి నాలుగున్నర కేజీల బంగారాన్ని తప్పుడు పత్రాలతో కాజేశారు.
News March 13, 2025
ఆసక్తిగా ఆసిఫాబాద్ రాజకీయం

ASF జిల్లాలో BRS, BJP ఒక్కో MLA ఉన్నారు. 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా వర్గపోరు కలిచివేస్తోంది. BRSనుంచి ఎమ్మెల్సీ విఠల్, మాజీ MLAలు కోనప్ప, సక్కుల చేరికతో కాంగ్రెస్లో బలం పెరిగినా సీనియర్లకు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఇక ASFలో MLA కోవ లక్ష్మి క్యాడర్ను కాపాడుకుంటూ పని చేసుకుంటున్నారు. సిర్పూర్ MLA హరీశ్బాబు స్థానికంగా ఉండడనే విమర్శలున్నా పార్టీ క్యాడర్ ప్రజల్లోకి వెళ్తోంది.
News March 13, 2025
HYD: యువతుల మధ్య వాగ్వాదం.. కేసు నమోదు

యువతిపై ఫిలింనగర్ PSలో అట్రాసిటీ కేసు నమోదైంది. టోలిచౌకిలో ఒకే రూమ్లో ఉంటున్న తనను మరో యువతి మానసిక వేదనకు గురిచేస్తోందని, ప్రశ్నిస్తే యువకులను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయసాగిందని బాధితురాలు తెలిపింది. ఇటీవల ఓ యువకుడికి తన ఫోన్తో మెసేజ్ చేసిందని, నిలదీస్తే ‘నిన్ను రేప్ చేయించి.. మర్డర్ చేయిస్తా’అంటూ బెదిరించిందని ఆమె వాపోయింది. ఈ మేరకు బాధితురాలు PSలో ఫిర్యాదు చేసింది.