News March 13, 2025

సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.

Similar News

News February 11, 2026

శ్రీశైలంలో భక్తుల రద్దీ

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. రా.12 గంటల నుంచి నేటి ఉ.7:42 వరకు 13,380 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీరిలో కాలినడకన వచ్చిన వారు 5,928 మంది ఉన్నారు. రద్దీ కారణంగా ఇరుముడి కలిగిన శివస్వాములకు, అలంకార దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

News February 11, 2026

అరకప్పు కాఫీకి కాడు అభివృద్ధి కోసం పని చేయండి: కడప కలెక్టర్

image

ప్రొద్దుటూరు అభివృద్ధి సమీక్షలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అరకప్పు కాఫీ కోసం కాకుండా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పొద్దుటూరు మున్సిపల్ అధికారులకు చురకలు అంటించారు. ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు 1/2 టీ కోసం గొడవ పడి, హోటల్ ర్యాంప్ కూల్చివేతకు జేసీబీ తీసుకెళ్లారు. ఈ ఘటనపై ACP నాగరాజును సస్పెండ్, ఛైర్మన్ వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేశారు.

News February 11, 2026

జనగామ 10.19%.. స్టేషన్ ఘన్పూర్ 11.53 % పోలింగ్

image

జనగామ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు విడుదల చేశారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 44,045 మంది ఓటర్లలో 4,489 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని 10.19 శాతం పోలింగ్ నమోదైంది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18,550 మంది ఓటర్లలో 2,138 మంది ఓటు వేయగా 11.53 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.