News February 10, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి కలెక్టరేట్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో డీపీఓ సాయి బాబా, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News September 14, 2025
MDK: రూ.1,04,88,964 రికవరీ

లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బులు, విలువైన సమయం ఆదా అవుతుందని, రాజీతో ఇద్దరూ గెలిచినట్లే అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తులు అన్నారు. MDKలో 4,987 కేసులు, SRDలో 4,334, SDPTలో 3,787 కేసులు పరిష్కారించినట్లు వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్& డ్రైవ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, E-పిట్టీ కేసులు, తగాదాలు తదితర కేసులను రాజీ కుదిర్చామన్నారు. MDKలో రూ.1,04,88,964 రికవరీ చేశారు.
News September 14, 2025
వరి: సెప్టెంబర్లో ఎరువుల యాజమాన్యం ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు దాదాపు <<17675869>>పూర్తయ్యాయి<<>>. పంట వివిధ దశల్లో ఉంది. పిలక దశలో ఉన్న పైర్లలో ఎకరానికి 35KGల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉంటే 35KGల యూరియాతోపాటు 15KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. పిలకలు వేసే దశలో పొలంలో కనీసం 2CM వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. కాగా ఈ నెలలో వరినాట్లు వేయరాదు. వేస్తే పూత దశలో చలి వల్ల గింజ పట్టక దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
News September 14, 2025
HZB: సైబర్ నేరగాళ్లను తెలివిగా బోల్తా కొట్టించిన తల్లి

సైబర్ నేరగాళ్ల నుంచి KNR(D) HZBకు చెందిన సుస్రత్ అనే మహిళ తెలివిగా తప్పించుకుంది. ఆమె కూతురు పోలీసుల కస్టడీలో ఉందని సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. కేసు పరిష్కారం కోసం వెంటనే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట్లో భయపడినప్పటికీ, ఆమె వెంటనే తేరుకుని తన కూతురు చదువుతున్న కాలేజీకి వెళ్లింది. అక్కడ ఆమె కూతురు క్షేమంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.