News October 23, 2025

సంగారెడ్డి: పఠనాసక్తిని పెంచేందుకే రూమ్ టు రీడ్: డీఈఓ

image

విద్యార్థులు పఠనాసక్తిని పెంచేందుకే రూమ్ టు రీడ్ కార్యక్రమం అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలో మండల విద్యాధికారులకు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఈఓ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఎంఓ బాలయ్య, రూమ్ టు రీడ్ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News October 24, 2025

న్యూజిలాండ్‌పై విజయం.. సెమీస్‌కు భారత్

image

WWCలో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచులో టీమ్ ఇండియా DLS ప్రకారం 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ <<18085029>>340<<>> పరుగులు చేసింది. ఛేదనలో వర్షం కురవడంతో లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్దేశించారు. భారత బౌలర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 271 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ చేరింది.

News October 24, 2025

HYD: రామంతాపూర్‌లో బెట్టింగ్‌లకు బలైన డిగ్రీ విద్యార్థి

image

HYD రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అరుణ్(18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి రజిత ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 24, 2025

HYD: రామంతాపూర్‌లో బెట్టింగ్‌లకు బలైన డిగ్రీ విద్యార్థి

image

HYD రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అరుణ్(18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి రజిత ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.