News February 16, 2026
సంగారెడ్డి: పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
Similar News
News February 21, 2026
నల్లగొండ: 14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్లగొండ 5వ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్లగొండ, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సంతోష్ సూచించారు.
News February 21, 2026
నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.
News February 21, 2026
అమెరికా అమ్మాయి.. మంచిర్యాల అబ్బాయి..!

అమెరికా న్యూయార్క్కు చెందిన అమ్మాయికి మన సింగరేణి ప్రాంతానికి చెందిన అబ్బాయితో శుక్రవారం హిందూ సాంప్రదాయంగా వివాహం జరిగింది. కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన గంగిపెల్లి ప్రణీత్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడి అమ్మాయి లవీనతో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి పెద్దలను ఒప్పించి అమ్మాయి కోరిక మేరకు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అమెరికా అమ్మాయిని చూసేందుకు పలువురు ఉత్సాహం చూపారు.


