News September 6, 2025

సంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కొండాపూర్‌లోని తొగర్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అశోక్, ఆత్మ కమిటీ ఛైర్మన్ ప్రభు, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 6, 2025

VZM: ఎరువుల స‌ర‌ఫ‌రాపై రేపు డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్‌

image

ఎరువుల స‌ర‌ఫ‌రాపై రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు, వారి నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను స్వీక‌రించేందుకు ఆదివారం డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్‌ కార్య‌క్ర‌మాన్ని అంబేడ్కర్ ఏర్పాటు చేశారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌లు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మ‌ధ్య 9441957315 నంబ‌రుకు ఫోన్ చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

News September 6, 2025

రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

image

AP: చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ‘మ.3.30గంటలకు ఆలయం మూసివేస్తాం. ఎల్లుండి సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తాం. మధ్యాహ్నంలోపు 30వేల మందికి దర్శనం కల్పిస్తాం. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు’ అని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయం కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు.

News September 6, 2025

ANU: ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత ఏప్రిల్ నెలలో జరిగిన ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ 4వ సెమిస్టర్ ఫలితాలు శనివారం అధికారులు విడుదల చేశారు. రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 15న చివరి తేదీగా పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్‌కు ఒక్కొక్క సబ్జెక్టుకు ఈ నెల 16వ తేదీలోపు రూ.1,860 చెల్లించాలన్నారు.