News August 18, 2025
సంగారెడ్డి: పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్టూడెంట్ పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈనెల 21 వరకు https://ecomitram.app/nspc/school వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు జిల్లా ఎన్జీసీ కో ఆర్డినేటర్ మాధవ రెడ్డి 94400 69750 నంబరును సంప్రదించాలని సూచించారు.
Similar News
News August 18, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 287.4 mm వర్షపాతం

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 287.4మి.మి. నమోదైనట్లు కలెక్టరేట్ నుంచి ప్రకటన విడుదల చేసింది. అత్యధికంగా పాలకొండలో 40.6 మి.మీ, అత్యల్పంగా సీతంపేట2 మి.మీ వర్షం పడింది. G.M వలస-7.2, భామిని-21.2, వీరఘట్టం-12.6, కురుపాం-7.4, గరుగుబిల్లి-9.2, సాలూరు19.6, G.Lపురం 9.6, కొమరాడ 39.2, పార్వతీపురం23.4, పాచిపెంట17.0, మక్కువ 11.8, సీతానగరం 14.2 బలిజి పేట 25.2 మి.మి.వర్షపాతం నమోదయిందన్నారు.
News August 18, 2025
మన గుంటూరు హీలియం పుట్టినిల్లు

హీలియం అనే పదం వినగానే మనలో చాలామందికి బెలూన్లు గుర్తుకు వస్తాయి. అయితే, ఈ హీలియంను గుంటూరులో కనుగొన్నారు. 1868, ఆగస్టు 18న సూర్యగ్రహణం సమయంలో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జూల్స్ జాన్సెన్ సూర్యునిలోని ఓ గీతలో ఒక కొత్త మూలకాన్ని కనుగొన్నారు. ఆ మూలకానికి ఆయన హీలియం అని పేరు పెట్టారు. భూమిపై ఇంతకుముందు ఈ మూలకం ఉనికి లేకపోవడంతో ఇది గుంటూరుకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
News August 18, 2025
ANU: పరీక్షల షెడ్యూల్ విడుదల

ANU పరిధిలోని కాలేజీల్లో బీ-ఫార్మసీ II/IV 4వ, III/IV 6వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 15, 16 తేదీల నుంచి పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు జరిమానా లేకుండా ఈనెల 28లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in ను సందర్శించవచ్చని పేర్కొంది.