News April 2, 2025

సంగారెడ్డి: ‘పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు..’

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వల్లూరు క్రాంతి, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

కర్నూలులో రూ.16,699 పలికిన ధర

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మిర్చి సూపర్-10 రకం క్వింటా రూ.16,699 పలికింది. మిర్చి-5 రకం రూ.16,599, మిర్చి బాడిగ రకం రూ.15,809కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కందులు క్వింటా గరిష్ఠ ధర రూ.7,249, కనిష్ఠ ధర రూ.1,669 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ. 8,700, మినుములు రూ.7,569, మొక్క జొన్నలు రూ.1,849, ఆముదాలు రూ.6,104 పలికాయి.

News January 8, 2026

నాగర్‌కర్నూల్: జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఊర్కొండ 10.8, వెల్దండ, బిజినపల్లి, బల్మూర్ మండలాల్లో 11.0, తెలకపల్లి మండలంలో 11.1, తాడూర్ మండలంలో 11.4, అమ్రాబాద్ మండలంలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 8, 2026

ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా ఏదులాపురం!

image

ఖమ్మం రూరల్ మండలంలోని 12 పంచాయతీలతో ఏర్పడిన నూతన ఏదులాపురం మున్సిపాలిటీ, జిల్లాలోనే అత్యధిక ఓటర్లు (45,256), వార్డులు (32) కలిగిన పురపాలికగా నిలిచింది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 26 అభ్యంతరాలు రాగా, బీఎల్ఓల విచారణ అనంతరం ఈ నెల 10న తుది జాబితా ప్రకటించనున్నారు. అత్యధికంగా ఒకటో వార్డులో 1,710 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.