News April 18, 2025
సంగారెడ్డి: పాము కాటుకు రైతు మృతి

పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన హత్నూర మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. నాగుల్ దేవుపల్లికి చెందిన దూడి అంజయ్య (46) గురువారం రాత్రి పొలానికి వెళ్లగా అక్కడ కాలుకి పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 19, 2025
అక్టోబర్లో BRS అధ్యక్షుడి ఎన్నిక: KTR

TG: BRS పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్లో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వెల్లడించారు. HYD నేతలతో సమావేశమైన ఆయన పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు, ఈనెల 27న WGLలో జరిగే సభపై దిశానిర్దేశం చేశారు. ఆ సభ తర్వాత కొత్తగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటామని, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు.
News April 19, 2025
MPL: చిరుత మృతి.. వెలుగులోకి కొత్త విషయాలు?

మదనపల్లె పొన్నేటిపాళ్యం వద్ద చిరుత పులిని చంపిన కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా, తప్పించుకు తిరుగుతున్న వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు.. వన్యప్రాణులను వేటాడి బక్షించడమే కాకుండా నగదుకు విక్రయాలు చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలిందని సమాచారం. దీని వెనక ప్రొఫెషనల్స్ ముఠా ఉన్నట్లు తెలుస్తోది.
News April 19, 2025
ఖమ్మం: డిగ్రీ విద్యార్థులలో అయోమయం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు సోమవారం నుంచి 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ యూనివర్సిటీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు కొనసాగుతాయా? వాయిదా పడతాయా? యూనివర్సిటీ అధికారులు తెలపకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.